గొడవర్రు(చేబ్రోలు): ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయాలైన సంఘటన సోమవారం గొడవర్రులో జరిగింది.
ఆటో బోల్తా..ముగ్గురికి గాయాలు
Oct 17 2016 11:05 PM | Updated on Aug 28 2018 7:24 PM
గొడవర్రు(చేబ్రోలు): ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయాలైన సంఘటన సోమవారం గొడవర్రులో జరిగింది. చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన ఆరుగురు వ్యవసాయ కూలీలు మిర్చినాట్లకు వెళ్లి ఆటోలో ఇంటికి తిరుగుప్రయాణమవగా గొడవర్రు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎం.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, హమీహనిలకు తీవ్ర గాయాలైనాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలైనాయి. బాధితులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement