ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి : డీఈఓ | aadhar must for students | Sakshi
Sakshi News home page

ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి : డీఈఓ

Oct 7 2016 11:58 PM | Updated on Oct 4 2018 4:39 PM

విద్యార్థులంతా ఆధార్‌ నెంబర్‌ పొందేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ అంజయ్య సూచించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యార్థులంతా ఆధార్‌ నెంబర్‌  పొందేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ అంజయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి విద్యార్థికీ ఆధార్‌ అనుసంధానం తప్పనిసరన్నారు. ఆధార్‌ నంబర్‌ లేని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 14న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు జేసీ నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సూచించారు. అలాగే జిల్లాలో 1,82,185 మంది బయోమెట్రిక్‌ లేని విద్యార్థులు ఉన్నారన్నారని, వీరంందరినీ సమీపంలోని మీసేవా, ఆధార్‌సెంటర్లకు తీసుకెళ్లి అప్‌డేట్‌ చేయించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement