యువకుడి హత్య కేసులో ఆరుగురి అరెస్టు
యువకుడి హత్య కేసులో ఆరుగురిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఆ వివరాలను వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన పందిరి శివ (22)ను గత నెల 18న మల్లయ్యపేట సమీపంలోని
రాజమహేంద్రవరం క్రైం :
యువకుడి హత్య కేసులో ఆరుగురిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఆ వివరాలను వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన పందిరి శివ (22)ను గత నెల 18న మల్లయ్యపేట సమీపంలోని పేపర్మిల్లు ఉత్తరం వైపు ఉన్న రహదారి పక్కన నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేశారు. మృతుడు తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్తో సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు నిందితులను శాటిలైట్ సిటీలో అరెస్టు చేశారు. వారినుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ముఠాకక్షలతోనే..
పందిరి శివ గోకవరం బస్టాండ్, కోటగుమ్మం బస్టాండ్, అదెబ్బ దిబ్బ ప్రాంతాలలో నేరాలు, చోరీలు చేస్తూ ఒక బ్యాచ్కు నాయకుడిగా వ్యవహరించేవాడు. కొట్లాట కేసుకు సంబంధించి అతడిని ఏప్రిల్ 18న అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. తిరిగి బెయిల్పై మే 15న విడుదలయ్యాడు. అన ంతరం తన స్నేహితులు పదిమందితో కలిసి మే 26న రాజేంద్రనగర్కు చెందిన ధనాల రమేష్ను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్ వెనుక వైపు పడవేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు .. శివ, మరో పదిమందిని అరెస్టు చేసి సెంట్రల్ జైల్కు తరలించారు. కాగా.. మృతిచెందిన ధనాల రమేష్ రౌడీషీటర్ కరణం శ్రీనివాస్ అనుచరుడు. అతడు కూడా వేరే కేసులో సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ధనాల రమేష్ హత్య అనంతరం కరణం శ్రీనివాస్, పందిరి శివ వర్గాలు ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారు. బెయిల్పై విడుదలైన కరణం శ్రీనివాసు తన అనుచరులతో పథకం రచించాడు. దాని ప్రకారం పందిరి శివను బెయిల్పై రప్పించాడు. కరణం శ్రీనివాస్, వల్లెపు సమాధానం రాజు, ఉప్పులూరి వీరబాబు, చెల్లుబోయిన శివ మణికంఠ, మేకల శివ, ఒగ్గు శ్రీనివాస్, బొండా దుర్గా ప్రసాద్ తదితరులు పందిరి శివతో మద్యం తాగించి, ఆటోలో ఇంటినుంచి బయటకు తీసుకువచ్చి హత్య చేశారు. ఈ సమావేశంలో అడిషినల్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు, సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.