అప్పుతీసుకున్న వాడే హంతకుడు | murder mistery closed | Sakshi
Sakshi News home page

అప్పుతీసుకున్న వాడే హంతకుడు

Oct 20 2016 10:45 PM | Updated on Jul 30 2018 9:15 PM

రైల్వే క్వార్టర్‌లో అపస్మారక స్థితిలో లభించిన మహిళ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం పోలీస్‌ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారి ఆ వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..రాజమహేంద్రవరం రైల్వే క్వార్టర్‌లో చేతులు, కాళ్లు కట్టివేయబడి అపస్మారకస్థితిలో ఉన్న మహిళను ఈనెల 7న స్వీపర్లు గుర్తించారు. వారి సమాచారం మేరకు పోలీసుల

  • ∙వీడిన భవాని హత్య కేసు మిస్టరీ
  • ∙నిందితుడు రసూల్‌ అరెస్టు
  • రాజమహేంద్రవరం క్రైం :
    రైల్వే క్వార్టర్‌లో అపస్మారక స్థితిలో లభించిన మహిళ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం పోలీస్‌ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారి ఆ వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..రాజమహేంద్రవరం రైల్వే క్వార్టర్‌లో చేతులు, కాళ్లు కట్టివేయబడి అపస్మారకస్థితిలో ఉన్న మహిళను ఈనెల 7న స్వీపర్లు గుర్తించారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మహిళను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ఆమె బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి వచ్చారు. వారిని విచారించిన అధికారులు ఆ మహిళను ఆలమూరు మండలం పెదపళ్లకు చెందిన చిలుకూరి భవాని (50)గా గుర్తించారు. ఆమె సెప్టెంబర్‌ 30న బాకీ వసూలు నిమిత్తం మండపేటకు బయలు దేరిందని మాత్రమే సమాచారం వచ్చింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 15న మృతి చెందింది. ఆమె అన్ని రోజులు కోమాలోనే ఉండడంతో ఘటనకు కారకులు తెలియలేదు.
     
    సెల్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడి గుర్తింపు
    ఈ కేసును పోలీసులు పటిష్టాత్మకంగా తీసుకున్నారు. భవాని వినియోగించే సెల్‌ఫో¯ŒSను పరిశీలించారు. అందులోని నంబరు ఆధారంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన ఎస్‌కే పెద్దపులి నబీ రసూల్‌ను నిందితుడిగా గుర్తించారు. రసూల్‌ 2011లో రాజమహేంద్రవరంలోని ఒక జ్యోతిషుడి వద్ద ఎలక్టిష్రియ¯ŒSగా పనిచేసేవాడు. అప్పుడు జ్యోతిషుడికి భవాని వంటచేసేది. ఆ సమయంలో ఆమె రసూల్‌కు రూ.25 వేలు అప్పు ఇచ్చింది. కాగా. బాకీ తీర్చాలని రసూలు ఇటీవల ఆమె కోరింది. అప్పుల్లో ఉన్న రసూల్‌.. భవాని ధరించే బంగారు ఆభరణాలపై కన్నేశాడు. రాజమహేంద్రవరం వస్తే బాకీ సొమ్ము ఇస్తానని చెప్పి సెప్టెంబర్‌ 30న భవానిని రాజమహేంద్రవరం రైల్వేకార్టర్‌కు రప్పించాడు. అతడు అనంతపురం జిల్లా గుత్తి నుంచి బయలుదేరి అక్కడకు వచ్చాడు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను భవానితో తాగించాడు. అనంతరం ఖాళీగా ఉన్న క్వార్టర్‌లోకి తీసుకువెళ్లి ఆమెను కట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి లైగింకదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ధరంచిన 39 గ్రాముల బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు. 
     
    వారం రోజులుగా నిర్బంధంలోనే..
    కాళ్లూచేతులూ కట్టివేయడం, నోట్లో గుట్టలు కుక్కివేయడంతో భవానీ అరవలేకపోయింది. క్వార్టర్‌ ఖాళీగా ఉండడంతో అటుగా ఎవ్వరూ రాలేదు. దీంతో ఆహారం, నీరు లేక ఆమె అపస్మాకరస్థితిలోకి వెళ్లిపోయింది. కాగా.. భవాని నగలను రసూల్‌ ఓ గోల్డ్‌ సంస్థలో తాకట్టు పెట్టాడు. నిందితుడిని 19వ తేదీన కర్నూల్‌ జిల్లాలోని అతని స్వగ్రామంలో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి బంగారు నగలు, రూ 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హత్య, లైంగిక దాడి కేసు నమోదు చేశారు. సమావేశంలో సౌత్‌ జో¯ŒS డీఎస్పీ సత్యనారాయణ, టూ టౌ¯ŒS సీఐ రవి కుమార్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement