మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య | Young woman committed suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

Jun 8 2018 12:34 PM | Updated on Aug 1 2018 2:20 PM

Young woman committed suicide - Sakshi

మృతురాలు పార్వతి 

విజయనగరం టౌన్‌: ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానియ యాతవీధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి రూరల్‌ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి.

యాతవీధికి చెందిన గంట్యాడ పార్వతి (19) గురువారం సాయంత్రం ఇంటిలో సీలింగ్‌కు ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే  పశువుల దొడ్డికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె చెల్లి  తలుపు కొట్టినప్పటికీ తీయకపోవడంతో కిటికీ తెరిచి చూడగా పార్వతి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది.

వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు విరగ్గొట్టి పార్వతిని కిందకు దించగా, అప్పటికే మృతి చెందింది. గోవింద్, అప్పలనరసమ్మలకు ముగ్గురు సంతానం కాగా పార్వతి రెండో అమ్మాయి. పార్వతి స్థానిక గాయత్రీ డిగ్రీ కళాశాలలో చదువుతోంది. చిన్నప్పటి నుంచి పార్వతికి పోలియో ఉందని, అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నాయని మృతురాలి తండ్రి గోవింద్‌ తెలిపారు. ఏఎస్సై జి. అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement