పెళ్లయిన 45 రోజులకే.. !

Young Man Suicide Attempt In Nalgonda - Sakshi

మిర్యాలగూడ రూరల్‌ : పెళ్లయిన 45 రోజులకే ఓ యువకుడు రైలు కిందపడి బలబన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కొండ్రపోల్‌– మిర్యాలగూడ రైల్వేస్టేషన్ల మధ్య గల చింతపల్లి శివారులో జరిగింది. నల్లగొండ రైల్వే ఎస్‌ఐ అచ్యుతం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు ఉదయం అక్కడి నుంచి వెళ్తుండగా రైలు ప ట్టాలపై యువకుడి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి యువకుడు దామరచర్ల మండలం కేంద్రానికి చెందిన అంబటి వీరప్రసాద్‌(26)గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడి తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడికి 45 రోజుల క్రితమే వివాహమైం ది. కోదాడలోని ఒక ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం రోజులుగా మూడీగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top