రైల్లో నుంచి జారిపడి చిన్నారి మృతి

Child Slips Away From The Narayanadri Express In Nellore - Sakshi

నెల్లూరు జిల్లా : కావలిలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి రోహిత అనే ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.  కావలి, వెంకటేశ్వరపురం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.

ఈ ఘటనతో చిన్నారి రోహిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలులో వాష్‌ రూంకు వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. రైలు రెండు కిలోమీటర్లు వెళ్లాక ఈ విషయం గుర్తించినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top