సూచీలు అక్కడక్కడే ఫ్లాట్గా
సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య స్తబ్దుగా అక్కడక్కడే ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో 100 పాయింట్ల నష్టానికి సమీపంలోకి వచ్చిన సెన్సెక్స్ ప్రస్తుతం 15 పాయింట్లు ఎగిసి 38716 వద్ద, 3 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,600 వద్ద ట్రేడవుతోంది.
పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్ నష్టాల్లో, ఐటీ, రియల్టీ, ఫార్మాస్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. హెచ్సీఎల్ టెక్, విప్రో, కోల్ ఇండియా, ఐవోసీ, యస్ బ్యాంక్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్ లాభపడుతుండగా ఏషియన్ పెయింట్స్, ఐబీ హౌసింగ్, ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంతా, టాటా స్టీల్, యూపీఎల్, అల్ట్రాటెక్ నష్టపోతున్నాయి.