1.65 కోట్లకు పెరిగిన మిలియనీర్లు | Millionaires' wealth reached all time high | Sakshi
Sakshi News home page

1.65 కోట్లకు పెరిగిన మిలియనీర్లు

Sep 28 2017 1:18 PM | Updated on Sep 28 2017 1:51 PM

Millionaires' wealth reached all time high

సాక్షి,న్యూఢిల్లీః ప్రపంచవ్యా‍ప్తంగా అసమానతలు వేగంగా పెరుగుతుంటే మిలియనీర్ల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య 8 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1.65 కోట్లకు చేరుకుందని కన్సల్టెన్సీ సంస్థ క్యాప్‌జెమినీ నివేదిక వెల్లడించింది. 2016లో రూ 5 కోట్లు అంతకుమించి పెట్టుబడులు పెట్టగల అధికాదాయ వ్యక్తుల(హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 8.2 శాతానికి పెరిగిందని, వీరందరి ఉమ్మడి సంపద 2025 నాటికి వంద లక్షల కోట్ల డాలర్లను దాటుతుందని ఆ నివేదిక అంచనా వేసింది.

గత ఏడాది కొత్తగా 15 లక్షల మందికి పైగా మిలియనీర్ల జాబితాలో చేరారని పేర్కొంది. ఈ జాబితాలో మూడింట రెండొంతుల మంది మిలియనీర్లు అమెరికా, జపాన్‌,జర్మనీ,చైనాలకు చెందిన వారేనని నివేదిక తెలిపింది.మిలియనీర్ల ఆస్తుల్లో వారి నివాసాల విలువ, వారు వినియోగించే అత్యంత ఖరీదైన వస్తువుల విలువను లెక్కించలేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement