నేడు కాకినాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YSRCP Leader YS Jaganmohan Reddy to Tour Kakinada Today | Sakshi
Sakshi News home page

నేడు కాకినాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Aug 27 2017 8:37 AM | Updated on May 29 2018 4:40 PM

నేడు కాకినాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన - Sakshi

నేడు కాకినాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు.

సాక్షి, కాకినాడ:  వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన రెండు చోట్ల బహిరంగ సభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు శనివారం మీడియాకు వెల్లడించారు.

జగన్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడకు వస్తారని, ఉదయం 10.30కు అన్నమ్మ ఘాట్‌ వద్ద సభలో ప్రసంగిస్తారన్నారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫామ్‌ సెంటర్‌లో ప్రసంగించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement