చంద్రబాబు పాలనలో అంతా అవినీతే! | YSRCP Leader Botsa Satyanarayana Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో అంతా అవినీతే! :

Aug 11 2018 4:43 PM | Updated on Aug 11 2018 5:55 PM

YSRCP Leader Botsa Satyanarayana Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, చీపురుపల్లి:  ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతేనని,  రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే తప్ప అభివృద్ధి శూన్యం మని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం  విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రమంత్రిగా పనిచేసిన  అశోక్‌ గజపతిరాజు  నాలుగేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.

మహారాజుకు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడ గుర్తుంటారని అన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అశుభం నెలకొంటుందని అన్నారు. టీడీపీ నాయకుల అవినీతి ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేలా బూత్‌ కమిటీలు పనిచేయాలని  వైఎస్సార్‌సీపీ నాయకులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement