262వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 262nd Day Schedule Released - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 262వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి రామకృష్ణా పురం, శ్రీకృష్ణ పురం, ఫైనాపిల్‌ కాలనీ, దరపాలెం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్‌ క్యాంప్‌ నుంచి దరపాలెం, అడవివరం, లండ గరువు క్రాస్‌ మీదుగా దువ్వపాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top