
సాక్షి, గజపతినగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం నైట్క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు, భూదేవీపేట క్రాస్, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్, గుడివాడ క్రాస్, మనపురం, మనపురం సంత, కోమటిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.