తిరుమల వెంకన్న ఆంధ్రప్రదేశ్కే! | ttd do not come under bifurcation limits, says government | Sakshi
Sakshi News home page

తిరుమల వెంకన్న ఆంధ్రప్రదేశ్కే!

May 29 2014 3:50 PM | Updated on Sep 27 2018 5:59 PM

తిరుమల వెంకన్న ఆంధ్రప్రదేశ్కే! - Sakshi

తిరుమల వెంకన్న ఆంధ్రప్రదేశ్కే!

చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కే చెందుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర విభజన ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీకి చెందిన నిధులు గానీ, ఆస్తులు గానీ విభజన పరిధిలోకి రావని ఈ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరులైన దేవుళ్ల జాబితాలో తిరుమల వెంకన్న ఉన్న విషయం తెలిసిందే. టీటీడీ పాలకమండలిలో రాజకీయ నాయకులకు స్థానం ఉంటుంది. అలాగే ఈవో, జేఈఓలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులే ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement