పోలీస్ స్టేషన్ ఎదుట వ్యాపారస్థులు ఆందోళన | Traders protest in front of the police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ ఎదుట వ్యాపారస్థులు ఆందోళన

Nov 30 2015 1:09 PM | Updated on Aug 21 2018 9:20 PM

వ్యాపారులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని నిరసిస్తూ.. వ్యాపారస్థులు ఆందోళనకు దిగారు.

వ్యాపారులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని నిరసిస్తూ.. వ్యాపారస్థులు ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా రాత్రి పూట కొందరు దుండగులు వాణిజ్య సముదాయాలపై దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ స్థానిక వ్యాపారస్థులు ధర్నాకు దిగారు.

రెండు రోజుల క్రితం స్థానిక గాంధీ సెంటర్‌లోని కూల్‌డ్రింక్ షాపు, పాన్‌షాప్‌లపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోక పోవడంతో.. ఆగ్రహించిన స్థానిక వ్యాపారస్థులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement