నేడు విశాఖకు వైఎస్ జగన్ | Today, YS jagan mohan Reddy to visit Visakhapatnam | Sakshi
Sakshi News home page

నేడు విశాఖకు వైఎస్ జగన్

Nov 11 2014 1:59 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేడు విశాఖకు వైఎస్ జగన్ - Sakshi

నేడు విశాఖకు వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖ నగరానికి వెళ్తున్నారు.

 కాపునాడు నేత మిరియాల కుటుంబీకులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
 

 సాక్షి, హైదరాబాద్: కాపునాడు నేత మిరియాల వెంకట్రావు కుటుంబీకులను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖ నగరానికి వెళ్తున్నారు. ఆయన ఉదయం 11.30 గంటలకు విమానంలో విశాఖకు వెళ్తారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. జగన్ సోమవారం మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. వెంకట్రావు భార్య ప్రమీల, కుమారుడు ఎం.వి.శేషగిరిబాబులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మిరియాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మృతి యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తంచేశారు. కాపు సామాజికవర్గం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. విషాద సమయంలో నిబ్బరంగా ఉండాలని శేషగిరిబాబుకు ధైర్యం చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement