రోజురోజుకి పెరుగుతున్న ఎండలకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు.
రోజురోజుకి పెరుగుతున్న ఎండలకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గులుమూరు గ్రామానికి చెందిన గుడివిడ అప్పయ్య(45) శుక్రవారం కూలి పనికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.