డెంగ్యూతో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండ పట్టణంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
సింగరాయకొండ: డెంగ్యూతో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండ పట్టణంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన షేక్ ఏసోబు సుల్తాన్(13) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులను సంప్రదించగా.. డెంగ్యూ అని నిర్ధరించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.