సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్ | Sonia Gandhi should apologise to seemandhra people, says Pawan Kalyan | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్

Mar 27 2014 8:21 PM | Updated on Mar 22 2019 5:33 PM

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్ - Sakshi

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్

సీమాంధ్ర ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖ స్టేడియంలో పవన్ చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు కింద ఇవ్వడమైనది
  • నాకు నటుడిగా ఓనమాలు నేర్పింది వైజాగే
  • కాంగ్రెస్‌ను కనికరం లేకుండా మట్టుపెట్టండి
  • పదికోట్లమంది గొంతెత్తితే కాంగ్రెస్ మట్టిలో కలిసిపోతుంది
  • మీ అందరి తరపున పోరాడేందుకే జనసేన పార్టీ పెట్టా
  • నేను కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా
  • ఈ ప్యాకేజీ లతో మనల్ని సంతృప్తిపరచగలరా?
  • వేషధారణలో కాదు..గుండెల్లో ఏముందో అదే నిజం
  • భారతజాతి,తెలుగుజాతి సమగ్రతను కాంగ్రెస్‌ చెరిపివేసింది
  • నేనంత కలిపితే పిడికెడు మట్టే కావొచ్చు.. కాని మన జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఉంది
  • చట్టం కొందరికి చుట్టంలా కాకుండా.. ప్రతి ఒక్కరికి ఒకేలా పనిచేసేలా ఉండాలని... పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం కావాలన్నారు. 
  • ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో తప్పు కనిపించలేదు
  • కొంత మంది నాయకుల ఒత్తిడి వల్లే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. 
  • నమ్ముకున్న సిద్దాంతాలు కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడను
  • అవినీతి పరులను పార్లమెంట్ పంపుతున్నాం. అందుకే మనకు దుర్ధశ
  • అందరి తరపున పోరాడేందుకే పార్టీ పెట్టాను
  • కాంగ్రెస్ పార్టీయే ప్రజలందర్ని రోడ్డుపైకి తీసుకు వచ్చింది 
  • రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలకు సోనియా, మన్మోహన్ లు వివరణ ఇస్తానని భావించా.. అలా జరగపోవడంతో కలత చెందాను. 
  • కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, బొత్స సత్యనారాయణలాంటి వ్యాపారవేత్తలకు విభజన అంశంపై పట్టింపేలేదు
  • వ్యాపార వ్యవహారాలు తప్ప సీమాంధ్ర నేతలకు సిద్దాంతాలు లేవు.
  • విభజన చేసిన తీరుపై నాకు కోపం, బాధ ఉంది
  • అన్నయ్యపై కోపం లేదు.. చెరోవైపు ఉన్నాం..అంతా దైవలీల
  • అన్నయ్య చిరంజీవికి ఎదురు వెళ్లడానికి రాజకీయాల్లోకి రాలేదు
  • 30 ఏళ్ల తర్వాత తెలంగాణ, సీమాంధ్రలో కలిసేందుకు ఉద్యమాలు రావోచ్చు
  • రాష్ట్ర విభజన జరిగి సీమాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే.. ఇద్దరు కాంగ్రెస్ నేతలు రాజధాని ఏర్పాటుపై జోక్ చేసుకుంటున్నారని.. అలాంటి నేతలను నిలదీయాలన్నారు. 
  • బాధ్యత తెలియన నాయకులను నిలదీయాలి
  • సంపూర్ణ క్రాంతే జనసేన పార్టీ గుర్తు
  • నిస్వార్ధంగా ప్రజల సంక్షేమం కొసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి
  • నిజాయితీ ఉన్న నేతల కోసం వెతుకుతా.. అలాంటి వారిని లభించినపుడే సీమాంధ్ర, తెలంగాణలో పోటీ చేస్తా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement