రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. మృతుడు ఒడిశావాసి. ఈ సంఘటన మండల పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ పరిధిలో సోమవారం
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
Aug 28 2013 12:30 AM | Updated on Apr 3 2019 7:53 PM
ఘట్కేసర్,న్యూస్లైన్: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. మృతుడు ఒడిశావాసి. ఈ సంఘటన మండల పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ పరిధిలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒడిశా రాష్ర్టం బరంపుర ప్రాంతానికి చెందిన కంచాడ సంతోష్(26) ఏడాదిగా మండల పరిధిలోని సింగపూర్ టౌన్షిప్లో అద్దెకు ఉంటూ స్థానిక ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి షిఫ్ట్ ఉండటంతో అతడు రాత్రి 11గంటల సమయంలో బైక్పై కంపెనీకి బయలు దేరాడు.
టౌన్షిప్ సమీపంలో ఉన్న రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న మరో బైక్ సంతోష్ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో సంతోష్ కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. మంగళవారం మృతదేహానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ అవివాహితుడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement