అక్కపై చెల్లెలి దాడి

Sister Attack And Stolen Assets Documents - Sakshi

ఇంటి పత్రాలు అపహరణ

మదనపల్లె క్రైం: ఇంట్లో ఒంటరిగా ఉన్న అక్కపై చెల్లెలు దాడి చేసి విలువైన పత్రాల ను అపహరించుకు వెళ్లింది. ఈ సంఘటన ఆది వారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక జడ్జి బంగ్లా సమీపంలో పళ్లవ్యాపారి మస్తాన్, ముస్టూరి బేగం దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మస్తాన్‌ నాలుగేళ్ల క్రితం మతి స్థిమితం కోల్పోయి ఎక్కడికో వెళ్లి పోయాడు. దీంతో అతని భార్య తన తమ్ము డు మెకానిక్‌ మస్తాన్‌ను సాక్కుంటోంది. మెకానిక్‌ మస్తాన్‌కు స్థానిక ఈశ్వరమ్మ కాలనీలో రూ.15 లక్షల విలువైన ఇంటి స్థలం ఉంది.

ఆ స్థలంపై అతని చిన్న చెల్లెలు షాన్‌వాజ్‌ బేగం కన్నేసింది. అన్న కారు మెకానిక్‌ షెడ్‌ వద్దకు వెళ్లిన తర్వాత ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అక్క ముస్టూరి బేగం(55)ను బెదిరించి బీరువాలో ఉన్న ఇంటి పత్రాలను తీసుకుంది. అడ్డుకున్న ముస్టూరి బేగంపై షాన్‌వాజ్‌ బేగం, ఆమె కుమారుడు సయ్యద్‌ బాషా దాడి చేశారు. డాక్యుమెంట్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చిన మస్తాన్‌ తన సోదరి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి ఆందోళన చెందాడు. విషయం తెలుసుకుని ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐలు సుమన్, వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top