వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..

Sankranti Celebrations At YSRCP Office Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల యక్షగానాలతోపాటు తెలుగు సంస్కృతి, సంప‍్రదాయాలు ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నగర అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి ఆధ్వర్యంలో 20 మంది పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బండి పుణ్యశీల, బొప్పన భవకుమార్‌, ఆసీఫ్‌, అడపాశేషు, అవుతు శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ మహబూబ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top