ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారిగట్ల గ్రామంలో దోపిడీ జరిగింది.
కొనకలమెట్ల : ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారిగట్ల గ్రామంలో దోపిడీ జరిగింది. బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారం మెరుగుపెడతామని చెప్పి ఓ ఇంట్లో దూరారు. మాకు ఎలాంటి మెరుగు అవసరం లేదని సదరు మహిళ చెప్పడంతో వెంటనే దుండగులు తెచ్చుకున్న స్ప్రేను ఆమె కళ్లలో చల్లారు. తేరుకునేలోపే మహిళ మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసుతో ఉడాయించారు. సంఘటన జరిగినప్పుడు ఆమె ఒక్కటే ఇంట్లో ఉంది. భర్త పొలానికి వెళ్లాడు.బాధితురాలు రజిత(27) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.