రాష్ట్ర ప్రభుత్వం 2013, 2014 సంవత్సరాలకు సంబంధించి నంది నాటకోత్సవాలను ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు అధికారికంగా రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం 2013, 2014 సంవత్సరాలకు సంబంధించి నంది నాటకోత్సవాలను ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు అధికారికంగా రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.