గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
గుంటూరు(దుగ్గిరాల) : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని దుగ్గిరాల మండలం పెద కొండూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
భర్త వేధింపులు తట్టుకోలేకు బుధవారం రాత్రి పద్మావతి(35) తన కూమార్తె జయశ్రీ(15)తో కలసి పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వీరిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఇద్దరూ ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.