తల్లీ, కూతురు బలవన్మరణం | Mother commits suicide along with daughter | Sakshi
Sakshi News home page

తల్లీ, కూతురు బలవన్మరణం

Jul 16 2015 3:32 PM | Updated on Nov 6 2018 7:56 PM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

గుంటూరు(దుగ్గిరాల) : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని దుగ్గిరాల మండలం పెద కొండూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

భర్త వేధింపులు తట్టుకోలేకు బుధవారం రాత్రి పద్మావతి(35) తన కూమార్తె జయశ్రీ(15)తో కలసి పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వీరిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఇద్దరూ ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement