ఇద్దరి ప్రాణాలు తీసిన అనుమానం | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలు తీసిన అనుమానం

Published Tue, Sep 2 2014 9:59 AM

Man murders wife and childrens with an Axe in ysr district

కడప :  వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో విషాదం చోటుచేసుకుంది. అనుమానం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికాడు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
Advertisement