తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
కోట్ల రూపాయలు వెచ్చించి ఓటర్లను ప్రలోభపెట్టి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా గెలుపొందాలన్న టీడీపీ వ్యూహం ఫలించింది. మద్యం, ధన ప్రభావంతో మెజార్టీ సీట్లను గెలుచుకోగలిగారు. ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవడంలో టీడీపీ నేతలు సఫలమయ్యారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు ఓటర్లు షాక్ ఇచ్చారు. 22వ డివిజన్లో పోటీ చేసిన ఆయన సోదరుడి కుమారుడు వనమాడి శివప్రసాద్ను ఓడించారు. సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.జి.కిశోర్ చేతిలో ఓటమి పాలయ్యారు.