ప్రకాశం జిల్లాలోని వల్లంపల్లి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం గుండెపోటుతో కౌలు రైతు మృతిచెందాడు.
వల్లంపల్లి (ప్రకాశం జిల్లా): జిల్లాలోని వల్లంపల్లి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం గుండెపోటుతో కౌలు రైతు మృతిచెందాడు. అద్దంకి సమీపంలోని వెంపరాలకు చెందిన కౌలురైతు గోసాల కోటయ్య(60) పొగాకు తీసుకొచ్చాడు. గురువారం ఉదయం వేలంపాట జరుగుతుండగా గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గమనించిన రైతులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. దీంతో మార్కెట్ కమిటీ అధికారి శ్రీనివాసులు వేలంపాటను నిలిపేశారు. కోటయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే కోటయ్య కౌలు రైతు కాదని, రైతుకు సాయంగా వచ్చిన వ్యవసాయ కూలీ అని కొందరు అంటున్నారు.