హాస్టల్ గదిలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య | Engineering Student Commits Suicide at hostel room | Sakshi
Sakshi News home page

హాస్టల్ గదిలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Jan 31 2014 1:47 PM | Updated on Sep 2 2017 3:13 AM

నగరంలోని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని స్వాతి శుక్రవారం హాస్టల్ గది ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

నగరంలోని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని స్వాతి శుక్రవారం హాస్టల్ గది ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అ విషయాన్ని తోటి విద్యార్థులు వెంటనే గ్రహించారు. వెంటనే ఆ సమాచారాన్ని హాస్టల్ యాజమాన్యానికి అందించారు. దాంతో విద్యార్థులు సహాయంతో స్వాతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 

అప్పటికే స్వాతి పరిస్థితి విషమంగా ఉండటంతో మార్గమధ్యంలో మరణించింది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి మరణంపై ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే స్వాతి అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్వాతి పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement