పున్నమి ఘాట్‌లో సీపీఐ ఆందోళన | CPI protest at punnami ghat in krishna river | Sakshi
Sakshi News home page

పున్నమి ఘాట్‌లో సీపీఐ ఆందోళన

Nov 15 2017 1:35 PM | Updated on Apr 3 2019 5:24 PM

విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్‌లో సీపీఐ ఆందోళన చేపట్టింది.

సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్‌లో సీపీఐ ఆందోళన చేపట్టింది. పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.

ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే అనుమతి లేని పడవలు తిరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని సీపీఐ నగర కార్యదర్శి శంకర్‌ ప్రశ్నించారు. మంత్రులే తమ బినామీలతో కృష్ణా నదిలో అక్రమంగా బోట్లను నడుపుతున్నారని ఆరోపించారు. మంత్రుల అవినీతి, పర్యాటక శాఖ అసమర్థతకు 22మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement