ప్రజావంచన దినం పాటిస్తున్న కాంగ్రెస్ | congress protest in andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రజావంచన దినం పాటిస్తున్న కాంగ్రెస్

Mar 31 2015 10:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఎన్నికల్లో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం

విజయవాడ : ఎన్నికల్లో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. టీడీపీ మేనిఫెస్టోకు నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ 'ప్రజా వంచన దినం'గా పాటిస్తోంది. రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement