వీవీ వినాయక్ కు ప్రముఖుల పరామర్శ | celebrities Visitation on VV Vinayak | Sakshi
Sakshi News home page

వీవీ వినాయక్ కు ప్రముఖుల పరామర్శ

Dec 5 2014 1:16 AM | Updated on May 25 2018 9:17 PM

వీవీ వినాయక్ కు ప్రముఖుల పరామర్శ - Sakshi

వీవీ వినాయక్ కు ప్రముఖుల పరామర్శ

ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి నాగరత్నం మృతి వారి కుటుం బానికి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు.

 చాగల్లు :  ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి నాగరత్నం మృతి వారి కుటుం బానికి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. గురువారం చాగల్లు వచ్చిన అయన వీవీ వినాయక్‌ను కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వినాయక్ సొదరుడు మాజీ సర్పంచ్ సురేంద్రకుమార్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
 నాగరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆత్కూరి దొరయ్య, మండల కన్వీనర్ బొర్రా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు (అబ్బులు), పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ముప్పిడి విజయరామ్, నాయకులు పరిమి శ్రీనివాస్, మైపాల రాంబాబు, చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, మట్టా వెంకట్రావు, ప్రగళ్లపాటి సుబ్బారావు, కొండేపాటి సూర్యనారాయణ వారి వెంట ఉన్నారు.  
 
 ప్రముఖుల పరామర్శ : వీవీ వినాయక్‌ను పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు కలిసి సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కారుపాటి వివేకానంద, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, జిల్లా కాపునాడు నాయకులు గెడ్డం రాధాకృష్ణ, ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మహాలక్షు్ష్మడు, ఉప్పులూరి రామకృష్ణ, స్థానిక నాయకులు నాగరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement