31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | AP Assembly sessions will start from 31 August | Sakshi
Sakshi News home page

31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Aug 24 2015 7:29 PM | Updated on Jul 12 2019 4:28 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సోమవారం ప్రారంభమై శుక్రవారం(సెప్టెంబర్ నాలుగో తేదీ)తో ముగుస్తాయి. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ ఉదయం 9.30 గంటలకు సమావేశమందిరంలో సమావేశం అవుతుంది. శాసనమండలి 10.30 గంటలకు శాసనమండలి సమావేశ మందిరంలో సమావేశమౌతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement