సంతాన ‘లక్ష్మి’ | Adi Lakshmi Three gives birth to triplets in | Sakshi
Sakshi News home page

సంతాన ‘లక్ష్మి’

Aug 14 2014 1:56 AM | Updated on Sep 2 2017 11:50 AM

సంతాన ‘లక్ష్మి’

సంతాన ‘లక్ష్మి’

పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో రాజాం మండలం ఒమ్మి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

 రాజాంరూరల్: పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో రాజాం మండలం ఒమ్మి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ఆదిలక్ష్మికి జి.సిగడాం మండలం జామి గ్రామానికి చెందిన కుప్పిలి రాముతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. నాలుగేళ్ల కిందట ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిం ది. రెండో సంతానంలో ఒకే సారి ముగ్గురు బిడ్డలు జన్మించడం, ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి జననాలు అరుదుగా జరుగుదాయని ఆస్పత్రి వైద్యుడు జి.హనుమంతరావు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement