
గజపతినగరం రూరల్: గజపతినగరం సర్కిల్ పరిధిలోని నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 20 మందికి స్థానిక ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జూనియర్ సివిల్ జడ్జి పల్లి నాగేశ్వరరావు జైలుశిక్ష, జరిమానా విధించినటుట ఎస్ఐ పి.వరప్రసాద్ శనివారం తెలిపారు. గజపతినగరం పరిధిలోని ఏడుగురు, బొండపల్లిలో ముగ్గురు, పెదమానాపురంలో ఐదుగురు, స్టేషన్బూర్జివలస ఐదుగురికి ఒకొక్కరికి వారం రోజుల చొప్పున జైలుశిక్ష, జరిమానా విధించినట్టు చెప్పారు.