ఆస్ట్రేలియాతో శనివారం ఉప్పల్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడటం అనుమానంగా మారింది. ప్రాక్టీస్ సెషన్లో ధోనికి గాయం కావడంతో అతను ఆడటంపై సందేహం నెలకొంది. శుక్రవారం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ధోని ముంజేతికి గాయమైంది. జట్టు సహాయక సిబ్బంది రాఘవేంద్ర విసిరిన ఒక త్రోకు ధోని గాయపడ్డాడు. వేగంగా విసిరిన బంతి ధోని కుడిచేతికి బలంగా తగలడంతో ధోని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేదు. ఈ క్రమంలోనే అతను తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.