ఓట్లనే అనుకున్నాం...మనుషులనే తొలగిస్తున్నారు..
టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో ప్రచారం చేశారు. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డి కడపకి ఎంపీ సీటు ప్రకటించారో... అప్పుడే వివేకానందరెడ్డి హత్యకే బీజం పడింది. గతంలో వైఎస్ జగన్ను కూడా హతమార్చడానికి కూడా యత్నించారు. సిట్పై నమ్మకం లేదు. సిట్ చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తుంది. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు