ఏపీలో పరిపాలన గాడి తప్పింది
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన చూస్తుంటే... మనం భారతదేశంలో ఉన్నామా?, వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ పాలన ఆశాజనకంగా లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి లేదన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి రెవెన్యూ లోటు ఉందంటూ పదే పదే చెబుతూ మరోవైపు వేలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నామని నాలుగేళ్లు నుంచి చెబుతున్నారని, తాము ఏం చెప్పినా నడుస్తుందనే భావనలో ఇక్కడ ప్రభుత్వం ఉందని తలసాని విమర్శించారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు సందర్భంగా ఏపీ సర్కార్ ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారని తలసాని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు