తిరుమలలో గత బుధవారం పెద్ద కొండచిలువ కనిపించి కలకలం రేపిన విషయం మరువక ముందే.. శనివారం శ్రీవారి ఆలయం సమీపంలో మళ్లీ పాము ప్రత్యక్షమై భయాందోళలనకు గురి చేసింది. పుష్కరిణి సమీపంలోని వైభవోత్సవ మండపం దగ్గర శనివారం పాము కనిపించింది. దీంతో పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది అటవీ శాఖలో పనిచేస్తున్న భాస్కర నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన చెట్ల పొదల్లో ఉన్న పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు
Oct 28 2017 3:52 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement