యుద్ధ విమానంలో ప్రయాణించిన రాజ్నాథ్
యుద్ధ విమానం తేజాస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్లో పైలట్ వెనుక సీటులో కూర్చున్న రాజ్నాథ్ సింగ్ హెల్మెట్ ధరించి, ఆక్సిజన్ మాస్క్తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్లోని హాల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా ఉన్నానని రాజ్నాథ్ సింగ్ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు