రేపల్లెలో మహిళ పై దాడి

పిల్లల అపహరణ వదంతులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. చిన్నారులను కిడ్నాప్‌ చేస్తున్నారనే అనుమానంతో పలుచోట్ల అమాయకులపై స్థానికులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం రేపల్లె రైల్వే స్టేషన్‌లో పిల్లలను అపహరిస్తుందేమోనన్న అనుమానంతో ఓ మహిళను ప్రయాణికులు చితకబాదారు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top