గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి

కర్నాటకలోని హుబ్లీలో దారుణం చోటుచేసుకుంది. గుర్రపు బండి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న గుర్రపు బండి పైనుంచి ప్రమాదవశాత్తూ ఓ యువకుడు కిందపడి మృతిచెందాడు. హుబ్లీలోని భూదానగడ్డ బసవేశ్వర ఆలయం ఆధ్వర్యంలో బుధవారం గుర్రపు బండ్ల రేసు నిర్వహించారు.

అయితే ఈ రేసులో పాల్గొన్న ఓ యువకుడు గుర్రపు బండి నుంచి కిందపడి వెనకాలే వస్తున్న మరో గుర్రపు బండి కిందపడి మృతిచెందాడు. ఈ గుర్రపు బండ్ల రేసుకి నిర్వాహకులు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. రోడ్డు పక్క నుంచి తిలకిస్తున్న యువకులు తీసిన వీడియోలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top