గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకి చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.‌ మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top