రాజధాని విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు
రాజధానిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో బొత్స మాట్లాడుతూ.. రాజధానిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నపై కాకుండా సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు