చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా? | Ambati Rambabu Slams TDP British India Comments | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా?

May 2 2018 1:21 PM | Updated on Mar 21 2024 8:58 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మపోరాటదీక్షలో చంద్రబాబు బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడిందని చెప్పడం మండిపడ్డారు.

చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను నెటిజన్లు కూడా అడుగుతున్నారని అన్నారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా, హైదరాబాద్‌ను తాను నిర్మించానని, భారత్‌కు సెల్‌ఫోన్‌ను తెచ్చానని చంద్రబాబు చెప్పుకోవడమే ఈ అనుమానం కలిగిస్తోందని చెప్పారు. తిరుపతి బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేస్తారని ప్రజలు ఆశించారన్నారు. అయితే, అందుకు భిన్నంగా చంద్రబాబు టీడీపీ బ్రిటీష్‌పై పోరాటం చేసిందనడంతో ప్రజలందరూ నవ్వుకున్నారని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement