ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం విజయవాడలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదంటూ అంబటి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం రాత్రి సమయాల్లో యాత్ర చేశారని ఎద్దేవా చేశారు.