పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ‘విజయ సంకల్పం’ స్తూపం వైపు అడుగులు చేరువయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పాదయాత్ర చేసేటప్పుడు వెంకట రాంబాబు అనే ఆటో డ్రైవర్ కలిశాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు మణికంఠకు బ్రెయిన్ ట్యూమర్. ఆస్పత్రులకు వెళ్తే రూ.ఆరు లక్షలు అవుతుందన్నారు.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. ఆ తండ్రి నిస్సహాయతను చూసి జాలేసింది. పిల్లాడికి వైద్యసాయం అందేలా చేశాను. ఆపరేషన్ పూర్తయి ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈరోజు ఆ తండ్రి కొడుకును ఎత్తుకుని వచ్చి సంతోషాన్ని పంచుకుంటుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది.
340వ రోజు పాదయాత్ర డైరీ
Jan 9 2019 7:19 AM | Updated on Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement