225వ రోజు పాదయాత్ర డైరీ

నాగగని అనే సోదరుడు తన తల్లి విషాద జీవితం గురించి చెబుతున్నప్పుడు.. పాలకుల పాపం పేదలకు ఎంతలా శాపమవుతుందో కళ్లకు కట్టింది. అతడి తల్లి.. అర్జంపూడి వెంకటలక్ష్మి భర్తను కోల్పోయిన విధివంచిత. అది చాలదన్నట్టు ఏ పనీ చేయలేని అమాయకుడైన చిన్న కొడుకు. తనకొచ్చే వితంతు పింఛన్, కూలిపని చేసి వచ్చే డబ్బులతో బతుకును భారంగా ఈడ్చేదట. తన కష్టం ఎంతైనా కొడుకుకు అండగా ఉండాలని.. బతుకు పోరాటం చేస్తున్న ఆ తల్లికి అనుకోని విపత్తు అశనిపాతంలా తాకింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటిదాకా వస్తున్న పెన్షన్‌ ఆగిపోయిందట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top