అమరావతిలో ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షం రాకపోవడం దురదృష్టకరమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని ఆహ్వానించకుండా, పైపెచ్చు విమర్శలు చేయడం సరికాదని పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదని, పైగా ప్రతిపక్షాలు రాలేదని చంద్రబాబబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Mar 2 2017 5:22 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement