వైస్సాఆర్ జయంతి, షర్మిల రక్తదానం | | Sakshi
Sakshi News home page

Jul 8 2013 4:51 PM | Updated on Mar 22 2024 11:01 AM

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురష్కరించుకుని మహానేత తనయ షర్మిల సోమవారం రక్తదానం చేశారు. విశాఖ జిల్లా సరిపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతంలోనే ఆమె రక్తదానం చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌, వైఎస్‌ విజయమ్మ సోదరి కూడా రక్తదానం చేశారు. డాక్టర్‌ హరికృష్ణ పర్యవేక్షణలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు వైఎస్ఆర్‌ అభిమానులు కూడా రక్తదానం చేసి...తమ అభిమానం చాటుకున్నారు. అలాగే వైఎస్ఆర్‌ జయంతి సందర్భంగా షర్మిల అనాధ, అంధ విద్యార్థులను కలుసుకున్నారు. వారికి దుస్తులు, బ్రెడ్, పళ్లు పంపిణీ చేశారు. సరిపల్లిలోనే వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. రైతు బాంధవుడు వైఎస్ఆర్‌ జయంతిని పురష్కరించుకుని షర్మిల సర్వమత ప్రార్థనలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement